BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

తెలంగాణ
03 Jan, 2026 - 08:36 AM
112 వీక్షణలు

2027 గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాలి

ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్ NTODAY NEWS: జగిత్యాల జిల్లా  జూలై 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్ధులు, వికలాంగులు మరియు ట్రాన్స్‌జెండర్ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్‌తో కలిసి పుష్కరాల ప్రణాళికపై ప్రాథమికంగా సమీక్ష నిర్వహించారు. మున్సిపల్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి తదితర ఇంజనీరింగ్ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి, పుష్కరాలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నందున ధర్మపురి పట్టణాన్ని ఆధ్యాత్మిక పట్టణంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ సందర్భంగా పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన అవసరమైన ఏర్పాట్ల కోసం ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ధర్మపురిలో గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. పుష్కరాల సందర్భంగా వచ్చే భక్తుల రద్దీని అంచనా వేసి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. పుష్కర స్నానాల కోసం వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. 2027 జూలై 23 నుంచి ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలకు శాశ్వత మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. పుష్కర ఘాట్లకు వచ్చే భక్తులకు అవాంతరాలు లేకుండా లింక్ రోడ్లు, ఇతర సౌకర్యాలు శాశ్వతంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లాలో ప్రవహించే గోదావరి నది తీరం వెంట ఉన్న గ్రామాల్లో కూడా పుష్కర ఘాట్ల ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పుష్కర స్నానాలకు అనువైన గోదావరి తీర ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని తెలిపారు. 2015లో సుమారు 1.50 కోట్ల మంది భక్తులు పుష్కరాలకు హాజరైనట్లు గుర్తు చేస్తూ, ఈసారి దాదాపు 4.50 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఎంతమంది భక్తులు వచ్చినా ఇబ్బందులు తలెత్తకుండా రోడ్లు, రహదారుల నిర్మాణం, ట్రాఫిక్ నిర్వహణ, వాహనాల పార్కింగ్, తాగునీరు, స్నాన ఘాట్లు, వసతి సదుపాయాలు తదితర అన్ని ఏర్పాట్లు సమగ్రంగా ఉండేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. Follow us on Website Facebook Instagram YouTube