BREAKING
వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి
Date of Publish : 15 July 2026, 08:51 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ముద్రగడతో ఆత్మీయ బంధానికి నిదర్శనంగా పాడె మోసిన వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Jul, 2026 - 08:51 PM
52 వీక్షణలు

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం భౌతికకాయానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నివాళులర్పించారు. ఆయన స్వగృహానికి వెళ్లిన జగన్, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ముద్రగడ చివరి కోరిక మేరకు ఆయన నివాస ఆవరణలోనే కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముద్రగడతో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వైఎస్ జగన్ స్వయంగా పాడె మోశారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణతో పాటు పలువురు పార్టీ నేతలు కూడా అంతిమయాత్రలో పాల్గొని పాడె మోశారు.

ముద్రగడ భౌతికంగా దూరమైనా, ఆయన కుటుంబంతో వైఎస్సార్‌సీపీకి ఉన్న అనుబంధం చిరస్థాయిగా కొనసాగుతుందని పార్టీ నాయకులు పేర్కొన్నారు. ముద్రగడ ప్రజా జీవితంలో చేసిన సేవలను స్మరించుకుంటూ పలువురు నేతలు ఘనంగా నివాళులర్పించారు.