ముద్రగడతో ఆత్మీయ బంధానికి నిదర్శనంగా పాడె మోసిన వైఎస్ జగన్
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం భౌతికకాయానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నివాళులర్పించారు. ఆయన స్వగృహానికి వెళ్లిన జగన్, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ముద్రగడ చివరి కోరిక మేరకు ఆయన నివాస ఆవరణలోనే కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముద్రగడతో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వైఎస్ జగన్ స్వయంగా పాడె మోశారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణతో పాటు పలువురు పార్టీ నేతలు కూడా అంతిమయాత్రలో పాల్గొని పాడె మోశారు.
ముద్రగడ భౌతికంగా దూరమైనా, ఆయన కుటుంబంతో వైఎస్సార్సీపీకి ఉన్న అనుబంధం చిరస్థాయిగా కొనసాగుతుందని పార్టీ నాయకులు పేర్కొన్నారు. ముద్రగడ ప్రజా జీవితంలో చేసిన సేవలను స్మరించుకుంటూ పలువురు నేతలు ఘనంగా నివాళులర్పించారు.