ఆయుస్మాన్ వయో వందన కార్డు ల గురించి చర్చించిన AP బీజేపీ చీప్
కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన సీనియర్ సిటిజన్ కార్డులు మరియు "ఆయుష్మాన్ వయో వందన కార్డ్” లను అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తప్పనిసరిగా అంగీకరించేలా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ Nara Chandrababu Naiduకి విజ్ఞప్తి చేయడం జరిగింది.
ప్రత్యేకంగా, సీనియర్ సిటిజన్ కార్డులు మరియు ఆయుష్మాన్ వయో వందన కార్డులను అనేక ఆసుపత్రులలో అంగీకరించకపోవడం వల్ల వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేయడం జరిగింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు తగిన ఆదేశాలు జారీ చేసి, అన్ని సంస్థలు ఈ కార్డులను గౌరవించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో సేవలందిస్తున్న హోం గార్డుల సంక్షేమానికి సంబంధించిన అంశాలు, అదే విదంగా ఏపీలోని తీర ప్రాంతమైన నెల్లూరు, ఒంగోలు, బాపట్ల ప్రాంతాల్లోని మత్సకారులకు పొరుగున ఉన్న తమిళనాడు కడలూరు కారేకల్ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడి వారికి ఇబ్బందులు సృష్టిస్తున్నారు అని, శాంతిభద్రతలకు భంగం కలుగచేస్తున్న సంఘటనలు అనేక పర్యాయాలు ఇక్కడ జరుగుతున్నాయి అని తమిళనాడు మత్స్యకారులు స్పీడు బోట్లతో ఆంధ్ర తీరప్రాంతంలో మత్స్యసంపదను దోచుకుంటున్నాయి అని తెలియజేశారు.