BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

ముంబైలో మళ్లీ కరోనా కలకలం.. పెరుగుతున్న కోవిడ్ కేసులు..!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jun, 2026 - 08:43 PM
143 వీక్షణలు

దేశాన్ని ఒకప్పుడు వణికించిన కరోనా వైరస్ మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. ఆర్థిక రాజధాని ముంబైలో గత వారం రోజులుగా కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు వెల్లడించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే వైరల్ ఇన్ఫెక్షన్లు పెరగడం ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసింది.

బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి చెందిన పాథాలజీ నిపుణుడు డాక్టర్ సంజయ్ మేహతా మాట్లాడుతూ, ప్రస్తుతం ముంబైలో స్వైన్ ఫ్లూ, ఇన్‌ఫ్లూయెంజా, కరోనా కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. తమ ప్రయోగశాలలో ప్రతిరోజూ సుమారు ఏడు కోవిడ్ లేదా స్వైన్ ఫ్లూ కేసులు గుర్తిస్తున్నట్లు చెప్పారు.

నెల రోజుల క్రితం వరకు స్వైన్ ఫ్లూ కేసులే ఎక్కువగా ఉండేవని, అయితే గత వారం రోజుల నుంచి కోవిడ్ కేసులు కూడా నమోదవుతున్నాయని వెల్లడించారు. బ్రీచ్ క్యాండీ, బాటియా ఆస్పత్రుల్లో ఒక్కో కరోనా రోగి చికిత్స కోసం చేరినట్లు తెలిపారు. అధిక జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పలువురు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారని వైద్యులు పేర్కొన్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జ్వరం లేదా శ్వాసకోశ సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.