ముత్తునూరులో ముస్లిం మైనార్టీలకు రంజాన్ తోఫా పంపిణీ
ముత్తునూరులో ముస్లిం మైనార్టీలకు రంజాన్ తోఫా పంపిణీ
ముత్తునూరు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముస్లిం మైనార్టీ సోదర సోదరీమణులకు రంజాన్ కానుక (తోఫా) పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం అందజేసిన ఈ చీరలను స్థానిక నాయకులు, అధికారులు కలిసి లబ్ధిదారులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ కుషనపల్లి లక్ష్మి పోషమల్లు, అక్రమ్ మాలిక్, వార్డు నెంబర్లు ఓరగంటి రామ రాజయ్య, మేడి శంకర్, సంగ సుమలత తిరుపతి, కల్లేపల్లి పద్మ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్య అతిథులుగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గోల్వ తిరుపతి, కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు అనుమల మంజుల, గ్రామ శాఖ అధ్యక్షులు బైరం లచ్చిరెడ్డి ముక్తేశ్వర నీటి ఎత్తిపోతల పథకం వైస్ చైర్మన్ గాదాసు పోశయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ సత్తయ్య మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ముస్లిం మైనార్టీ సోదర సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.