www.ntodaynews.com
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి
తెలంగాణ
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్
ధర్మపురి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ వేగం పెంచింది. శుక్రవారం పట్టణంలోని 10, 11, 15వ వార్డుల పరిధిలోని మూలబండ ప్రాంతంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు గడపగడపకు వివరించారు. పట్టణ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని పేర్కొంటూ, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఈ కార్యక్రమంలో వొజ్జల లక్ష్మణ్, జక్కు పద్మ, సంగి ఆనంద్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అభ్యర్థుల విజయం కోసం ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో, సమన్వయంతో పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
#CongressCampaign
#DharampuriMunicipalElections
#LocalBodyElections
#TelanganaPolitics
#ElectionCampaign
#PublicWelfare
#NTodayNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube