ముక్కట్రావ్ పేట పంచాయతీ భవనం ప్రారంభం
హాజరైన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్
వెల్గటూర్ మండలంలోని ముక్కట్రావ్ పేట గ్రామ పంచాయతీ నూతన కార్యాలయ భవనాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం కింద రూ.22.50 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ భవనాన్ని మంత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి హామీ ఈ సందర్భంగా గ్రామస్తులు తమ గ్రామంలో ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి సమస్యతో పాటు ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని, ముక్కట్రావ్ పేట గ్రామ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #MukkatravPet #Velgatoor #AdluriLakshmanKumar #TelanganaDevelopment #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube