నా జీవితం కన్నా దేశం గొప్పది అన్న వీరునికి జోహార్ లు
నా జీవితం కన్నా దేశం గొప్పది అన్న వీరునికి జోహార్ లు -- సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం
మార్చి 23 వ తేది భగత్ సింగ్,రాజ్ గురు, సుఖదేవ్ లు తమ ప్రాణాలను దేశం కోసం తృణ ప్రాయంగా అర్పించిన రోజు సందర్భంగా బొమ్మలరామారం మండల కేంద్రంలో సోమవారం రోజున సిపిఎం మండల ప్రధాన కార్యదర్శి ర్యాకల శ్రీశైలం ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతరాలు, వివక్షతలు లేని,శ్రమ దోపిడీ లేని సమ సమాజం కావాలని పోరాడి ఒరికొయ్యలకు ఊయల లూగిన విప్లవ వీర కిశోరాలు ,నిజమైన దేశభక్తులు భగత్ సింగ్, రాజ్ గురు , సుఖదేవ్ లు మనకు దూరమైన రోజు.వారికి విప్లవ జోహార్లు అని అన్నారు ఏదైనా నమ్మే ముందు దానిని ప్రశ్నించాలని, విచక్షణతో ఆలోచించడం ముఖ్యమని, మతం అనేది మనిషి బలహీనతకు సంకేతం అని, మనుషులను విడదీసే వ్యవస్థను భగత్ సింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు.అని అన్నారు నిజమైన స్వాతంత్ర్యం అంటే కేవలం బ్రిటిష్ పాలకులు వెళ్ళిపోవడం కాదు, సామాన్యుడు, కార్మికుడు, రైతు... ప్రతి ఒక్కరూ దోపిడీకి గురికాకుండా జీవించగలగడం అని నమ్మారు భగత్ సింగ్ అని అన్నారు వారి ఆశయాల కొనసాగింపులో పనిచేద్దాం. ప్రజలను దోపిడీ చేస్తున్న పాలకుల విధానాలపై పోరాడుదామని అన్నారు ఈ కార్యక్రమంలో ముక్కర్ల పున్నమ్మ, దేవేందర్, లక్ష్మీకాంత్, మైసయ్య, వేణు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు