BREAKING
ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కేంద్రం కొత్త రూల్స్.. సిలిండర్ కట్! శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో బీసీవై పార్టీ నాయకులు సత్య ప్రమాణం శాంతియుత వాతావరణంలో బక్రీద్.. మహానాడు కు పెద్ద ఎత్తున హాజరైన తెలుగు తమ్ముళ్లు.. జిల్లా జడ్జిని కలిసిన న్యాయవాదుల సంఘం సభ్యులు.. రైలులో చోరీ.. నిందితుల అరెస్టు ​బాల్క సుమన్‌పై దేశద్రోహం ఫిర్యాదు: రాజకీయ నిషేధం విధించాలని రామిళ్ల రాధిక డిమాండ్ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు: మంత్రి గడ్డం వివేకానంద అన్నారం ప్రభుత్వ బడిలో LKG, UKG మంజూరు: సర్పంచ్, గ్రామ పెద్దలు, ప్రజల పిలుపు! నార్కట్‌పల్లిలో బైకులు, మేకల దొంగల అరెస్ట్ ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కేంద్రం కొత్త రూల్స్.. సిలిండర్ కట్! శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో బీసీవై పార్టీ నాయకులు సత్య ప్రమాణం శాంతియుత వాతావరణంలో బక్రీద్.. మహానాడు కు పెద్ద ఎత్తున హాజరైన తెలుగు తమ్ముళ్లు.. జిల్లా జడ్జిని కలిసిన న్యాయవాదుల సంఘం సభ్యులు.. రైలులో చోరీ.. నిందితుల అరెస్టు ​బాల్క సుమన్‌పై దేశద్రోహం ఫిర్యాదు: రాజకీయ నిషేధం విధించాలని రామిళ్ల రాధిక డిమాండ్ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు: మంత్రి గడ్డం వివేకానంద అన్నారం ప్రభుత్వ బడిలో LKG, UKG మంజూరు: సర్పంచ్, గ్రామ పెద్దలు, ప్రజల పిలుపు! నార్కట్‌పల్లిలో బైకులు, మేకల దొంగల అరెస్ట్
www.ntodaynews.com

నార్కట్‌పల్లిలో బైకులు, మేకల దొంగల అరెస్ట్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
27 May, 2026 - 07:21 PM
158 వీక్షణలు

7 బైకులు, ఒక కారు స్వాధీనం

విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి బైకులు, మేకల దొంగతనాలకు పాల్పడుతున్న ఒక అంతర్రాష్ట్ర దొంగను, అతనికి సహకరిస్తున్న ఒక మైనర్ బాలుడిని  నార్కట్‌పల్లి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ. 20,000 నగదుతో పాటు 7 మోటార్ సైకిళ్ళు, దొంగతనాలకు ఉపయోగించిన ఒక బ్రీజా కారును స్వాధీనం చేసుకున్నట్లు నల్లగొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి శివరాం రెడ్డి కేసు వివరాలను తెలుపుతూ ​నల్లగొండ జిల్లా ఎస్పీ  శరత్ చంద్ర పవార్  ఆదేశాల మేరకు జిల్లాలో పెరుగుతున్న బైకులు దొంగతనాలు, పశువుల దొంగతనం కేసులపై నార్కట్‌పల్లి పోలీసులు ప్రత్యేక  నిఘా పెట్టారని తెలిపారు. ఈ క్రమంలో బుధవారం (27-05-2026) ఉదయం 9:00 గంటల ప్రాంతంలో నార్కట్‌పల్లి గ్రామ శివారులోని నల్లగొండ రోడ్డు ఫ్లైఓవర్ సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ​ఆ సమయంలో నంబర్ ప్లేట్ లేని ఒక హీరో ప్యాషన్ ప్రో బైక్‌పై అనుమానాస్పదంగా వస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపి విచారించగా, గత నెల 8వ తారీఖున న అమ్మనబోలు గ్రామానికి చెందిన జటంగి మహేష్ ఇంటి ముందు పార్క్ చేసి పోయిన బైక్ TS05EL5082 గా గుర్తించారు గుర్తించారని తెలిపారు. పట్టుపడ్డ నిందితులలో​గువ్వల శబరీష్ (29) , ​ఒక మైనర్ బాలుడు పట్టుబడ్డారు. గతంలో గువ్వల శబరీష్ నల్లగొండ జిల్లాలో 18 కేసులు, ఇతర రాష్ట్రాల్లో 3 కేసుల్లో నిందితుడిగా ఉండి జైలుకు వెళ్లి వచ్చాడు జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత సులభంగా డబ్బు సంపాదించి జల్సాలు చేయాలని ఇద్దరూ ప్లాన్ చేశారు. హైదరాబాద్‌లో ఒక బ్రెజ్జా కారును అద్దెకు తీసుకుని, పగటిపూట గ్రామ శివారుల్లో తిరుగుతూ రేకీ నిర్వహించేవారని
​రాత్రి వేళల్లో మేకలు, గొర్రెల దొడ్ల వద్దకు వెళ్లి వాటిని దొంగిలించి కారులో తరలించేవారని  అనంతరం వాటిని గుంటూరు జిల్లా నల్లపాడు సంతలో గుర్తుతెలియని వ్యక్తులకు విక్రయించి వచ్చిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడిపేవారు. అలాగే, ఇళ్ల ముందు పార్క్ చేసిన బైకుల తాళాలు విరగ్గొట్టి దొంగిలించి, వాటికి ఫేక్ నంబర్ ప్లేట్లు తగిలించి అవసరమైన వారికి  విక్రయించే వారిని పేర్కొన్నారు. నిందితులను విచారించగా
​నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో  2 బైకులు, 1 మేక దొంగతనం. ​దేవరకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 1 బైక్ దొంగతనం. కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో  2 బైకుల దొంగతనం. ​నల్లగొండ రూరల్ స్టేషన్ పరిధిలో  1 మేక దొంగతనం.​అచ్చంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో  1 బైక్ దొంగతనం. ​నెల్లూరు పట్టణంలో 1 బైక్ దొంగతనం కేసుల్లో నిందితులుగా ఉన్నారని తెలిపారు ​నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసును సమర్థవంతంగా ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన నార్కట్‌పల్లి సీఐ నాగరాజు, ఎస్ఐ విష్ణుమూర్తి, పోలీస్ కానిస్టేబుళ్లు సత్యనారాయణ, గిరిబాబు, సాయిలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.