నాస్పూర్ కూరగాయల మార్కెట్ సమస్యల పరిష్కారానికి కృషి: మేయర్ ధరణి మధుకర్
మార్కెట్ను స్వయంగా పరిశీలించిన మేయర్
సమస్యలు వివరిస్తూ వినతిపత్రం అందజేసిన వర్తక సంఘం
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాస్పూర్ కూరగాయల మార్కెట్ ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల సమస్యలపై మేయర్ ధరణి మధుకర్ ప్రత్యేక దృష్టి సారించారు. సీసీసీ రాయల్ టాకీస్ సమీపంలోని ఈ మార్కెట్ వర్తక సంఘం సభ్యులు మేయర్ను కలిసి.. మార్కెట్లో మరుగుదొడ్లు, వీధి దీపాలు, బోర్ మోటార్ల కొరత వంటి సమస్యలపై వినతిపత్రం సమర్పించి, తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. వర్తకుల విజ్ఞప్తిపై తక్షణమే స్పందించిన మేయర్, మార్కెట్ ప్రాంతాన్ని స్వయంగా సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మేయర్ ధరణి మధుకర్ మాట్లాడుతూ.. సమస్యల తీవ్రతను గుర్తించామని, వీటిని స్థానిక శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మార్కెట్ అభివృద్ధికి, వర్తకులకు మెరుగైన కనీస సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ పర్యటనలో మేయర్తో పాటు పలువురు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు వర్తక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు