నేటి నుండి అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం!
నేటి నుండి అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం!
అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మొదటి రోజు అయినటువంటి ఏప్రిల్ 14వ తేదీన పుంగనూరు అగ్నిమాపక కేంద్రంనకు పుంగనూరు పట్టణ సిఐ సుబ్బరాయుడు ముఖ్యఅతిథిగా విచ్చేసి ముందుగా అగ్నిమాపక శాఖలో మరణించినటువంటి వ్యక్తులకు నివాళులర్పించడం జరిగినది. తరువాత కరపత్రాలు, పోస్టర్లు మరియు బ్యానర్ను ఆవిష్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో సిఐ అగ్ని ప్రమాదాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు నివారణ చర్యలపై స్థానిక ప్రజలకు తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పుంగనూరు ఎస్సై అన్సర్ భాషా, పుంగనూరు ఇన్చార్జి కేంద్రాధికారి కే సురేష్ బాబు, సిబ్బంది ఇ సుబ్రమణ్యం, వి లక్ష్మీనారాయణ, పి ప్రసాద్, ఎం లోకేష్ రెడ్డి, జి వెంకటరమణ, వి కేశవ, ఎండి భూషణ్ కుమార్, బి వినోద్ కుమార్, కే మోహన్ బాబు, ఎస్సార్ వి ప్రకాష్, పి ఆనంద మరియు భగత్ సింగ్ కాలనీ ప్రజలు పాల్గొనడం జరిగినది.