www.ntodaynews.com
నీట్ రీ-టెస్ట్ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు: రామగుండం
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
నీట్ రీ-టెస్ట్ పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ తెలిపారు. బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ ప్రకారం 21వ తేదీన ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ఆంక్షలు కఠినంగా అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మంచిర్యాల జోన్ పరిధిలో మొత్తం ఐదు పరీక్షా కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్న సీపీ, ఆయా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుస్తు చర్యల్లో భాగంగా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు