నిరుపేద చేనేత విద్యార్థినికి ఎమ్మెల్యే వేముల వీరేశం చేయూత
నిరుపేద చేనేత విద్యార్థినికి ఎమ్మెల్యే వేముల వీరేశం చేయూత
ప్రతి పేద విద్యార్థి చదువు మధ్యన ఆగకుండా ఉండేందుకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని ప్రభుత్వ విప్ ,నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం అన్నారు .
చిట్యాల పట్టణానికి చెందిన చేనేత కార్మికుని కుటుంబానికి చెందిన మిర్యాల దీపిక ద్వితీయ సంవత్సరం కాలేజీ ఫీజు చెల్లింపులో ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం స్థానిక మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు బెల్లీ సత్తయ్య విషయము తెలుసుకొని ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి విద్యార్థిని తండ్రి మిర్యాల నరేష్ కు 50 వేల రూపాయల నగదును అందజేశారు. విద్యార్థిని ఆదుకున్న వేముల వీరేశం కు భక్త మార్కండేయ పద్మశాలి సంఘం అధ్యక్షులు జెల్ల మనోహర్, కార్యదర్శి గంజి వెంకటేశం, చిట్యాల చేనేత సహకార సంఘం అధ్యక్షులు గంజి సుధాకర్, ప్రధాన కార్యదర్శి చెరుపల్లి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేశారు.