BREAKING
ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
www.ntodaynews.com

నకిరేకల్‌లో జార్జి రెడ్డి వర్ధంతి

తెలంగాణ
/ నల్గొండ / నకిరేకల్
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
14 Apr, 2026 - 03:04 PM
100 వీక్షణలు

నకిరేకల్‌లో జార్జి రెడ్డి వర్ధంతి : NTODAY NEWS నకిరేకల్

ఘనంగా నివాళులర్పించిన ప్రభుత్వ విప్  ఎమ్మెల్యే వేముల వీరేశం

సమాజ మార్పు కోసం ప్రాణాలర్పించిన విప్లవ వీరుడు జార్జి రెడ్డి ఆశయాలు అమరమైనవని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కొనియాడారు. మంగళవారం నకిరేకల్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన జార్జి రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు . ఎమ్మెల్యే వీరేశం  జార్జి రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ విద్యార్థి దశలోనే అన్యాయంపై ఎదిరించి, సమానత్వం కోసం పోరాడిన జార్జి రెడ్డి చరిత్ర నేటి యువతకు ఒక దిక్సూచి వంటిదని అన్నారు. నాటి ఉస్మానియా విద్యార్థి ఉద్యమాల్లో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని గుర్తు చేశారు. జార్జి రెడ్డి కేవలం ఒక వ్యక్తి కాదు  అణచివేతపై   తిరుగుబాటు చేసిన వ్యక్తి అని పేర్కొన్నారు.  ఒక గొప్ప ఆలోచన. ఆయన ఆశయాలను కేవలం స్మరించుకోవడమే కాకుండా, వాటిని ఆచరణలో పెట్టినప్పుడే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు మరియు భారీ సంఖ్యలో యువత పాల్గొన్నారు.