BREAKING
ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం చిట్యాల ​1వ వార్డులో తాగునీటి విలవిల.. పట్టించుకోని అధికారులు , ప్రజా ప్రతినిధులు ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం చిట్యాల ​1వ వార్డులో తాగునీటి విలవిల.. పట్టించుకోని అధికారులు , ప్రజా ప్రతినిధులు ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు
www.ntodaynews.com

నల్లమల అడవిలో భారీ అగ్ని ప్రమాదం

తెలంగాణ
/ నాగర్ కర్నూల్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Apr, 2026 - 07:41 AM
55 వీక్షణలు

నల్లమల అడవిలో భారీ అగ్ని ప్రమాదం – అటవీ సంపదకు తీవ్ర నష్టం 

నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల అడవి పరిధిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఫరహాబాద్ మెయిన్ రోడ్డు సమీపంలో ప్రారంభమైన మంటలు కిలోమీటర్ మేరకు వ్యాపించి అడవిని చుట్టుముట్టాయి.

మంటల తీవ్రతతో అడవంతా దట్టమైన పొగలు కమ్ముకుని, పరిసర ప్రాంతాలు భయానకంగా మారాయి. అటవీ ప్రాంతంలో ఉన్న మొక్కలు, వృక్షాలు, వన్యప్రాణులకు తీవ్ర ప్రమాదం ఏర్పడింది.

ఈ ఘటనపై అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు తక్షణమే రంగంలోకి దిగి మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అగ్ని మరింత వ్యాపించకుండా నియంత్రణ చర్యలు చేపడుతున్నారు.

ఈ అగ్ని ప్రమాదం వల్ల విలువైన అటవీ సంపదకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మంటలు ఎలా చెలరేగాయనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.