BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

నందిగామలో వినియోగదారుల హక్కులపై న్యాయ విజ్ఞాన సదస్సు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Mar, 2026 - 12:18 AM
85 వీక్షణలు

నందిగామ: వినియోగదారులు తమ హక్కులను తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి మల్యాల సాహితి సూచించారు. వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నందిగామ గ్రామపంచాయతీలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్యాల సాహితి మాట్లాడుతూ, ప్రతి వ్యక్తి వినియోగదారుడేనని, వస్తువులు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. నాణ్యమైన వస్తువులనే కొనుగోలు చేయడం, తప్పనిసరిగా రసీదు తీసుకోవడం, గడువు ముగిసిన ఉత్పత్తులను కొనకూడదని సూచించారు.

ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వెబ్‌సైట్లను ఉపయోగించరాదని హెచ్చరించారు. ఒకవేళ వినియోగదారులు మోసపోతే జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఉన్న వినియోగదారుల ఫోరంలను ఆశ్రయించి నష్టపరిహారం పొందవచ్చని వివరించారు.

కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్వ వేణుగోపాల్ రావు, సిఐ ప్రసాద్, గ్రామ సర్పంచ్ కొమ్ము కృష్ణ, డిప్యూటీ సర్పంచ్ వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై అవగాహన పొందారు.