www.ntodaynews.com
నూజివీడు ఎక్సైజ్ స్టేషన్ లో ఆకస్మిక తనిఖీ
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
నూజివీడు ఎక్సైజ్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ప్రభు కుమార్
ఏలూరు జిల్లా నూజివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయాన్ని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ కేవీఎన్ ప్రభు కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ సందర్శన చేపట్టినట్లు ఆయన తెలిపారు.
తనిఖీ అనంతరం నూజివీడు సర్కిల్ పరిధిలోని మద్యం వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లైసెన్సుదారులందరూ ప్రభుత్వ నియమ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ వ్యాపారం నిర్వహించాలని స్పష్టం చేశారు.
నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే కేసులు నమోదు చేయడంలో వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు.