BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

నూజివీడు నియోజకవర్గంలో పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 May, 2026 - 04:46 PM
179 వీక్షణలు

నూజివీడు నియోజకవర్గంలో పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా ఆరోపణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పిడిఎస్) బియ్యం అక్రమ రవాణా యదేచ్ఛగా సాగుతోందన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో ఈ అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికంగా చర్చ కొనసాగుతోంది.

కొంతమంది అక్రమ రవాణాదారులు పలు రైస్ మిల్లులను లీజుకు తీసుకుని, అక్కడ పిడిఎస్ బియ్యాన్ని పాలిష్ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. కొన్ని నెలల క్రితం మిల్లుల్లో పిడిఎస్ బియ్యం పట్టుబడిన ఘటనలు వెలుగులోకి రావడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది.

పట్టుబడుతున్న పరిమాణం తక్కువగా ఉన్నప్పటికీ, వాస్తవానికి భారీ స్థాయిలో అక్రమ రవాణా జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా చాట్రాయి మండలం పరిధిలోని చిన్నంపేట, సి.గుడిపాడు, మర్లపాలెం గ్రామాల్లో స్ధావరాలు ఏర్పాటు చేసుకుని ఈ దందా కొనసాగుతోందని చెబుతున్నారు.

చిన్నంపేట గ్రామంలోని ఒక పెట్రోలు బంకు వద్ద నెంబర్ లేని వాహనాలు తరచూ నిలిపి ఉంచి పిడిఎస్ బియ్యాన్ని తరలిస్తున్న ఘటనలు గమనించబడ్డాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు విన్నవించినప్పటికీ చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వ్యవహారంపై పోలీసులు, ఫౌరసరఫరాల శాఖ అధికారులు సమన్వయంతో కఠిన చర్యలు తీసుకుంటే అక్రమ రవాణాను అరికట్టవచ్చని ప్రజలు కోరుతున్నారు.