BREAKING
జిల్లాలో మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు ప్రభుత్వం రైతులను ఇబ్బందులు చేయకుండా మండలంలోని వరి ధాన్యం కొనుగోలు వేగం పెంచాలి ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత పెరుగుతోంది – పలు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక మహిళా ఉద్యోగుల భద్రతే మా లక్ష్యం మంచిర్యాల: గొంతులో ఇరుక్కున్న మటన్ ఎముక.. పోతనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి రూ.10,000 సాయం – విద్యార్థి పట్టుదలకు అభినందనలు శ్రీరామవరం గ్రామంలో కోడిపందెంపై పోలీసుల దాడి..అదుపులో ఏడుగురు మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి – నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ జిల్లాలో మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు ప్రభుత్వం రైతులను ఇబ్బందులు చేయకుండా మండలంలోని వరి ధాన్యం కొనుగోలు వేగం పెంచాలి ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత పెరుగుతోంది – పలు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక మహిళా ఉద్యోగుల భద్రతే మా లక్ష్యం మంచిర్యాల: గొంతులో ఇరుక్కున్న మటన్ ఎముక.. పోతనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి రూ.10,000 సాయం – విద్యార్థి పట్టుదలకు అభినందనలు శ్రీరామవరం గ్రామంలో కోడిపందెంపై పోలీసుల దాడి..అదుపులో ఏడుగురు మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి – నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
www.ntodaynews.com

నూజివీడు నియోజకవర్గంలో పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 May, 2026 - 04:46 PM
26 వీక్షణలు

నూజివీడు నియోజకవర్గంలో పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా ఆరోపణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పిడిఎస్) బియ్యం అక్రమ రవాణా యదేచ్ఛగా సాగుతోందన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో ఈ అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికంగా చర్చ కొనసాగుతోంది.

కొంతమంది అక్రమ రవాణాదారులు పలు రైస్ మిల్లులను లీజుకు తీసుకుని, అక్కడ పిడిఎస్ బియ్యాన్ని పాలిష్ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. కొన్ని నెలల క్రితం మిల్లుల్లో పిడిఎస్ బియ్యం పట్టుబడిన ఘటనలు వెలుగులోకి రావడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది.

పట్టుబడుతున్న పరిమాణం తక్కువగా ఉన్నప్పటికీ, వాస్తవానికి భారీ స్థాయిలో అక్రమ రవాణా జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా చాట్రాయి మండలం పరిధిలోని చిన్నంపేట, సి.గుడిపాడు, మర్లపాలెం గ్రామాల్లో స్ధావరాలు ఏర్పాటు చేసుకుని ఈ దందా కొనసాగుతోందని చెబుతున్నారు.

చిన్నంపేట గ్రామంలోని ఒక పెట్రోలు బంకు వద్ద నెంబర్ లేని వాహనాలు తరచూ నిలిపి ఉంచి పిడిఎస్ బియ్యాన్ని తరలిస్తున్న ఘటనలు గమనించబడ్డాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు విన్నవించినప్పటికీ చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వ్యవహారంపై పోలీసులు, ఫౌరసరఫరాల శాఖ అధికారులు సమన్వయంతో కఠిన చర్యలు తీసుకుంటే అక్రమ రవాణాను అరికట్టవచ్చని ప్రజలు కోరుతున్నారు.