BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

నూజివీడు నియోజకవర్గంలో పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 May, 2026 - 04:46 PM
86 వీక్షణలు

నూజివీడు నియోజకవర్గంలో పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా ఆరోపణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పిడిఎస్) బియ్యం అక్రమ రవాణా యదేచ్ఛగా సాగుతోందన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో ఈ అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికంగా చర్చ కొనసాగుతోంది.

కొంతమంది అక్రమ రవాణాదారులు పలు రైస్ మిల్లులను లీజుకు తీసుకుని, అక్కడ పిడిఎస్ బియ్యాన్ని పాలిష్ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. కొన్ని నెలల క్రితం మిల్లుల్లో పిడిఎస్ బియ్యం పట్టుబడిన ఘటనలు వెలుగులోకి రావడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది.

పట్టుబడుతున్న పరిమాణం తక్కువగా ఉన్నప్పటికీ, వాస్తవానికి భారీ స్థాయిలో అక్రమ రవాణా జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా చాట్రాయి మండలం పరిధిలోని చిన్నంపేట, సి.గుడిపాడు, మర్లపాలెం గ్రామాల్లో స్ధావరాలు ఏర్పాటు చేసుకుని ఈ దందా కొనసాగుతోందని చెబుతున్నారు.

చిన్నంపేట గ్రామంలోని ఒక పెట్రోలు బంకు వద్ద నెంబర్ లేని వాహనాలు తరచూ నిలిపి ఉంచి పిడిఎస్ బియ్యాన్ని తరలిస్తున్న ఘటనలు గమనించబడ్డాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు విన్నవించినప్పటికీ చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వ్యవహారంపై పోలీసులు, ఫౌరసరఫరాల శాఖ అధికారులు సమన్వయంతో కఠిన చర్యలు తీసుకుంటే అక్రమ రవాణాను అరికట్టవచ్చని ప్రజలు కోరుతున్నారు.