నవోదయం 2.0 దాడి – నాటు సారా నిర్మూలనకు కఠిన చర్యలు
నూజివీడు: నవోదయం 2.0 దాడి – నాటు సారా నిర్మూలనకు కఠిన చర్యలు
ఏలూరు జిల్లా నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటు సారా నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవోదయం 2.0 కార్యక్రమం కింద చర్యలు కొనసాగుతున్నాయి. చాట్రాయి మండలం పోతనపల్లి పెద్ద తండా గ్రామంలో నిర్వహించిన దాడిలో సారా తయారికి సిద్ధంగా ఉంచిన 100 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి 3 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన గోపాల్ పై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏ. మస్తానయ్య తెలిపారు. నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి మండలాల్లో నాటు సారా తయారీ, బెల్ట్ షాపుల నిర్వహణపై కఠిన చర్యలు కొనసాగుతాయని, సారా తయారీకి బెల్లం సరఫరా చేసే వ్యాపారులు మరియు బెల్లపు ఊట కలిగి ఉన్న భూ యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. నాటు సారా కార్యకలాపాలపై సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, సమాచారం అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.