www.ntodaynews.com
నూజివీడు రూరల్ పోలీసులు పేకాట స్థావరంపై దాడి – 12 మంది అరెస్ట్లు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
నూజివీడు, 07.06.2026:
నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్ధార్థ నగరం గ్రామంలోని పేకాట స్థావరంపై నేరుగా దాడి చేసి 12 మంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ దాడి, నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ ఐ.వి. నాగేంద్ర కుమార్ పర్యవేక్షణలో, ఎస్ఐ జ్యోతిబాసు అందిన సమాచారం ఆధారంగా నిర్వహించారు. రాత్రి సమయంలో పోలీసులు ఆ స్థావరంలో ఉన్న వ్యక్తులను తనిఖీ చేసి, వారి వద్ద నుండి ₹22,500 నగదు మరియు 11 మోటార్సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ జ్యోతిబాసు తెలియజేశారు, ఈ దాడిలో పాల్గొన్న వ్యక్తులు సక్రమంగా అదుపులోకి తీసుకోబడ్డారని, వారి పై కేసు నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదు చేయబడినట్లు తెలిపారు.