నూజివీడులో శారద ఇంగ్లీష్ మీడియం స్కూల్కు SSCలో అద్భుత ఫలితాలు
నూజివీడులో శారద ఇంగ్లీష్ మీడియం స్కూల్కు SSCలో అద్భుత ఫలితాలు
నూజివీడులోని శారద ఇంగ్లీష్ మీడియం స్కూల్ 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించిన SSC పబ్లిక్ పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించింది. ముఖ్యంగా మొదటి బ్యాచ్తోనే విశిష్ట విజయాలను నమోదు చేయడం పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది.
ఈ ఏడాది పరీక్షల్లో కుప్పాల కార్తీక సాయి 600లో 583 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. ఇతర విద్యార్థులు కూడా 569, 563, 560, 554, 534, 500 మార్కులు సాధిస్తూ పాఠశాల ప్రతిష్టను మరింత పెంచారు. 500కు పైగా మార్కులు సాధించిన వారు మొత్తం ఏడుగురు ఉండగా, అన్ని విద్యార్థులు ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత సాధించడం విశేషం.
సంస్థ యాజమాన్యం మాట్లాడుతూ మొదటి బ్యాచ్తోనే అగ్ర ఫలితాలు సాధించడం ద్వారా నాణ్యమైన విద్య అందిస్తున్నామనే విషయాన్ని నిరూపించామని తెలిపింది.
ఈ విజయానికి అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ప్రణాళికాబద్ధమైన బోధన, విద్యార్థులకు నిరంతర మార్గదర్శనం ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు.
చైర్మన్ కే. శంకరరావు, కరస్పాండెంట్ కే. రాధిక, హెడ్మాస్టర్ మరియు సిబ్బంది విద్యార్థులు, తల్లిదండ్రులను అభినందించారు. భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తామని తెలిపారు.