నూజివీడులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ అవగాహన సదస్సు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ (Special Intensive Revision - స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) అవగాహన సదస్సు నిర్వహించారు.
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, నూజివీడు నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు మేకా ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లు (BLA)లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దూలం నాగేశ్వరావు (డీఎన్ఆర్), ఏలూరు పార్లమెంటు ఇన్చార్జ్ కారుమూరి సునీల్ కుమార్, ఏలూరు జిల్లా టాస్క్ ఫోర్స్ రాష్ట్ర కార్యదర్శి పోతుల శివారెడ్డి హాజరయ్యారు.
అలాగే జిల్లా బూత్ కమిటీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని బీఎల్ఏలకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు.