నూతన బస్సు సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే వేముల వీరేశం
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన రవాణా సేవలను అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని బస్టాండ్ నుండి వేములకొండ గ్రామానికి నూతనంగా మంజూరైన ఆర్టీసీ బస్సు సర్వీసును ఆయన బుధవారం జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు, రైతులు, కూలీలు మరియు సామాన్య ప్రజల రవాణా ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. చాలా రోజులుగా వేములకొండ ప్రజలు ఎదురుచూస్తున్న బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందని, ఈ నూతన బస్సు సేవను గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు, నాయకులు మరియు వేములకొండ గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన బస్సు సర్వీసును ప్రారంభించినందుకు స్థానికులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.