నూతన కార్యవర్గ సమావేశం ఎన్నిక.
ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం (SC, ST, BC, మైనార్టీ) నూతన కార్యవర్గ సమావేశం
ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ) ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సమావేశం 23 మార్చి 2026న ఉదయం 10:00 గంటలకు పుంగనూరు బి.ఎం.ఎస్ క్లబ్ ఆవరణంలో నిర్వహించబడును.
ఈ సమావేశంలో భాగంగా సంఘం బలోపేతానికి దళిత నాయకులను ఎంపిక చేయడం జరుగుతుంది. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ తప్పనిసరిగా హాజరై సంఘ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేయబడుతుంది.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ప్రతి నాయకుడు చురుకుగా పాల్గొని సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని కోరుతున్నాము.
కావున, సంఘానికి చెందిన అన్ని స్థాయి నాయకులు ఈ సమావేశానికి హాజరై విజయవంతం చేయగలరు.
ఈ మేరకు సంఘం గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎం. శంకరప్ప గారు తెలియజేశారు.