నరసింహారావుపాలెం బీసీ కాలనీలో నీటి కేకలు మూడు నెలలుగా తాగునీరు, వినియోగ నీరు లేక అవస్థలు
రోడ్డెక్కి నిరసన తెలిపిన కాలనీ వాసులు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం నరసింహారావుపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని బీసీ కాలనీ ప్రజలు తీవ్ర నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. గత మూడు నెలలుగా తాగునీటితో పాటు నిత్యావసరాల కోసం వినియోగించే నీరు కూడా సరఫరా కాకపోవడంతో కాలనీ వాసుల జీవనం దుర్భరంగా మారింది. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాకపోవడంతో సోమవారం కాలనీ ప్రజలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు.
ఇంటి అవసరాలకు, తాగునీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని వారు అధికారులను డిమాండ్ చేశారు.
ఈ విషయంపై ఎన్ టు డే న్యూస్ నరసింహారావుపాలెం పంచాయతీ స్పెషల్ ఆఫీసర్, మండల అభివృద్ధి అధికారి ఏబి సత్యనారాయణను వివరణ కోరగా, సమస్య తన దృష్టికి వచ్చిందని తెలిపారు. అవసరమైన చర్యలు చేపట్టి రెండు నుంచి మూడు రోజుల్లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. నరసింహారావుపాలెం టీడీపీ యువనేత పీఏసియస్ ఛైర్పర్సన్ కట్టా నాగ దుర్గా రావు ఎన్ టు డే న్యూస్ తో మాట్లాడుతూ ఈ రోజు నూతన బోరు బావి వేయించి మోటారు బిగించి శాశ్వత పరిష్కారం చేయిస్తానని హామీ ఇచ్చారు
అయితే, ఇచ్చిన హామీ ప్రకారం అధికారులు, కట్టా నాగ దుర్గా రావు వెంటనే చర్యలు తీసుకుని కాలనీ ప్రజల నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.