BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 26 December 2025, 09:13 am
Posted by : NTODAY NEWS OFFICIAL

జాతీయ వీర బాలల దినోత్సవం

తెలంగాణ
26 Dec, 2025 - 09:13 AM
235 వీక్షణలు

జాతీయ వీర బాలల దినోత్సవం

జోరా సింగ్, ఫతే సింగ్లకు ఏబీవీపీ నివాళి NTODAY NEWS : చిట్యాల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చిట్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో జాతీయ వీర బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక పాఠశాలలో జోరా సింగ్ మరియు ఫతే సింగ్ చిత్రపటానికి విదార్థులు పూలతో నివాళులర్పించారు ఈ సందర్భంగా ఏబీవీపీ మహాత్మ గాంధీ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు కొంపల్లి సూర్య , చిట్యాల పట్టణ కార్యదర్శి వంగూరు గణేష్ మాట్లాడుతూ మొఘలుల అరాచక పరిపాలనను ఎదిరించి ప్రాణత్యాగానికి వెనుకాడ కుండ గురువు గురు గోవింద్ సింగ్ కుమారులు 7 సంవత్సరాల ఫతేసింగ్, 9 సంవత్సరాల జొరావర్ సింగ్‌ వీరగాథను వారి త్యాగాలను దేశ ప్రజలు నిత్యం స్మరించుకోవాలని అన్నారు. చిన్నపిల్లలు అయినా సరే తండ్రి, అన్నల బాటలో దేశం కోసం, ధర్మం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా సమర్పించిన భారత మాత ముద్దు బిడ్డలు అని నాటి నవాబ్ వజీర్ ఖాన్ చూపెట్టిన ప్రలోభాలకు లొంగకుండా చూపెట్టిన భయానికి భయపడకుండా తమ తండ్రి గురు గోవింద్ సింగ్ గౌరవ మర్యాదలను కాపాడుకుంటూ ఈ దేశ ధర్మ స్వాభీమానాన్ని ఏ విదేశీ దురాక్రమదారుడి ముందు తాకట్టు పెట్టకుండా నవాబ్ 24 డిసెంబర్ 1704 న సజీవ సమాధిని చేస్తున్న సరే వారిలో ఎక్కడ భయము అనేది లేకుండా స్వాభిమానంతో వీరత్వాన్ని ప్రదర్శించి ఈ దేశ ధర్మ స్వాభిమానం అన్నిటికంటే విలువైనదని పసివయసులో ప్రాణత్యాగం చేసి నిరూపించిన ఆ వీర బాలలను వారి త్యాగాన్ని ప్రతి భారతీయుడు ప్రతిదినము స్మరించుకుంటు స్ఫూర్తిగా తీసుకోవలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నగర సంయుక్త కార్యదర్శి సిద్దు , యశ్వంత్ దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube