BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

న్యాయమూర్తుల నియామకాల్లో జోక్యం చేసుకోలేం: సుప్రీంకోర్టు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:46 AM
74 వీక్షణలు

న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి హైకోర్టు, సుప్రీంకోర్టు కొలీజియంలు తీసుకునే నిర్ణయాల్లో న్యాయపరంగా జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేవలం సీనియారిటీ ఉన్నంత మాత్రాన న్యాయమూర్తి పదోన్నతి పొందే హక్కు ఎవరికీ ఉండదని తేల్చిచెప్పింది.

తనకంటే జూనియర్లను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించడాన్ని సవాలు చేస్తూ హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

ఈ కేసును సోమవారం విచారించిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కొలీజియం తీసుకున్న నిర్ణయాలను తిరిగి పరిశీలించడం ద్వారా కొత్త వివాదాలకు తాము తెరతీయదలచుకోలేదని పేర్కొంది. న్యాయమూర్తుల ఎంపిక, పదోన్నతుల విషయంలో కొలీజియంకు ఉన్న అధికారాలను గౌరవించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

అలాగే పిటిషనర్‌కు ఇంకా పదేళ్ల సర్వీసు మిగిలి ఉన్నందున ఓపికగా వేచి ఉండాలని, భవిష్యత్తులో పదోన్నతి అవకాశం లభించే అవకాశముందని సూచించింది. ఈ సందర్భంగా సీనియారిటీ ఒక్కటే పదోన్నతికి ప్రమాణం కాదని, ఇతర అంశాలు కూడా పరిగణనలోకి తీసుకుంటారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.