BREAKING
గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి..
www.ntodaynews.com

న్యాయమూర్తుల నియామకాల్లో జోక్యం చేసుకోలేం: సుప్రీంకోర్టు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:46 AM
11 వీక్షణలు

న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి హైకోర్టు, సుప్రీంకోర్టు కొలీజియంలు తీసుకునే నిర్ణయాల్లో న్యాయపరంగా జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేవలం సీనియారిటీ ఉన్నంత మాత్రాన న్యాయమూర్తి పదోన్నతి పొందే హక్కు ఎవరికీ ఉండదని తేల్చిచెప్పింది.

తనకంటే జూనియర్లను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించడాన్ని సవాలు చేస్తూ హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

ఈ కేసును సోమవారం విచారించిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కొలీజియం తీసుకున్న నిర్ణయాలను తిరిగి పరిశీలించడం ద్వారా కొత్త వివాదాలకు తాము తెరతీయదలచుకోలేదని పేర్కొంది. న్యాయమూర్తుల ఎంపిక, పదోన్నతుల విషయంలో కొలీజియంకు ఉన్న అధికారాలను గౌరవించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

అలాగే పిటిషనర్‌కు ఇంకా పదేళ్ల సర్వీసు మిగిలి ఉన్నందున ఓపికగా వేచి ఉండాలని, భవిష్యత్తులో పదోన్నతి అవకాశం లభించే అవకాశముందని సూచించింది. ఈ సందర్భంగా సీనియారిటీ ఒక్కటే పదోన్నతికి ప్రమాణం కాదని, ఇతర అంశాలు కూడా పరిగణనలోకి తీసుకుంటారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.