www.ntodaynews.com
భ్రమరాంబాదేవికి కొబ్బరికాయల సమర్పణ
తెలంగాణ
భ్రమరాంబాదేవికి కొబ్బరికాయల సమర్పణ
NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున
చైత్రమాసంలో పౌర్ణమి అనంతరం భ్రమరాంబాదేవికి కుంభోత్సవం నిర్వహించడం సంప్రదాయం. ఈ ఏడాది కుంభోత్సవాన్ని ఏప్రిల్ 7న నిర్వహించనున్నట్లు దేవస్థానం కార్యాలయం ప్రకటించింది.
కుంభోత్సవం సందర్భంగా సాత్త్విక బలి రూపంలో కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు తదితర ఫలాలను సమర్పించడం ఆనవాయితీ. కుంభోత్సవం రోజున స్త్రీ వేషధారణలో ఉన్న పురుషుడు కుంభహారతి సమర్పించడం ప్రధాన ఘట్టంగా ఉంటుంది.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం ప్రతి మంగళవారం, శుక్రవారం భ్రమరాంబాదేవికి కొబ్బరికాయలు సమర్పించే కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 20న ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను రాశిగా పోసి పసుపు, కుంకుమలతో పూజలు నిర్వహించారు. అనంతరం వాటిని అమ్మవారికి సమర్పించారు.
ఈ కార్యక్రమం కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు నిర్వహించబడినట్లు దేవస్థానం వర్గాలు వెల్లడించాయి.
#Srisailam #BhramarambaDevi #TempleRituals #Kumbhotsavam #AndhraPradesh #SpiritualNews #HinduTraditions
Follow us on
Website
Facebook
Instagram
YouTube