పూరి గుడిసెకు అగ్ని ప్రమాదం
పూరి గుడిసెకు అగ్ని ప్రమాదం
సత్వర స్పందనతో మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది
పుంగనూరు మండలం బర్నేపల్లి గ్రామంలో ఒక పూరి గుడిసె అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటన 04-04-2026 అర్ధరాత్రి సుమారు 12:05 గంటలకు చోటుచేసుకుంది.
అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పుంగనూరు అగ్నిమాపక కేంద్ర సిబ్బంది, I/C కేంద్రాధికారి కే. సురేష్ బాబు ఆధ్వర్యంలో సంఘటన స్థలానికి చేరుకుని సెల్ఫ్ ట్యాంక్ సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ ప్రమాదంలో గుడిసె యజమాని ఏ. మాధవి (భర్త: వెంకటరమణ)కు చెందిన గుడిసె పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.1,50,000 విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని తెలిపారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం కప్పులేని దీపం కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
సమయానికి అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతో మరింత నష్టం జరగకుండా నివారించగలిగారు.