BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

పూరి గుడిసెకు అగ్ని ప్రమాదం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
04 Apr, 2026 - 08:00 AM
100 వీక్షణలు

పూరి గుడిసెకు అగ్ని ప్రమాదం

సత్వర స్పందనతో మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది

పుంగనూరు మండలం బర్నేపల్లి గ్రామంలో ఒక పూరి గుడిసె అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటన 04-04-2026 అర్ధరాత్రి సుమారు 12:05 గంటలకు చోటుచేసుకుంది.

అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పుంగనూరు అగ్నిమాపక కేంద్ర సిబ్బంది, I/C కేంద్రాధికారి కే. సురేష్ బాబు ఆధ్వర్యంలో సంఘటన స్థలానికి చేరుకుని సెల్ఫ్ ట్యాంక్ సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు.

ఈ ప్రమాదంలో గుడిసె యజమాని ఏ. మాధవి (భర్త: వెంకటరమణ)కు చెందిన గుడిసె పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.1,50,000 విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని తెలిపారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం కప్పులేని దీపం కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

సమయానికి అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతో మరింత నష్టం జరగకుండా నివారించగలిగారు.