ఒకరి మరణం… పలువురికి జీవం
అవయవ దానం గొప్పతనానికి నిలువెత్తు ఉదాహరణ
అవయవ దానం… మరణానికైనా మానవత్వం!
జంగారెడ్డిగూడెం:
ప్రతి ఒక్కరూ అవయవ దానం పట్ల అవగాహన కలిగి ఉండాలని గుంటూరు కిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వినోద్ పేర్కొన్నారు. ఇటీవల పట్టణానికి చెందిన నాయుడు మధుశ్రీ బ్రెయిన్ డెడ్ అయిన నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు చేసిన అవయవ దానం ఎంతో ఆదర్శప్రాయమని ఆయన అభినందించారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు జీవన్ దాన్ సంయుక్తంగా నాయుడు మధుశ్రీ కుటుంబ సభ్యులకు శనివారం అవయవ దానం డోనర్ సర్టిఫికెట్ను అందజేశారు.
డాక్టర్ వినోద్ మాట్లాడుతూ—కుమార్తె మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులు చూపిన మహోన్నత నిర్ణయం అనేకమందికి కొత్త జీవితం ప్రసాదించిందన్నారు. మధుశ్రీ ఊపిరితిత్తులు, లివర్, మూత్రపిండాలు, కళ్ళు దానం చేయడం ద్వారా పలువురి జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డోనర్ సర్టిఫికెట్ను తండ్రి సత్యనారాయణకు, సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ మరియు మేనమామ వీరమల్ల మధుకి అందజేశారు.
అవయవ దానం – ఒకరి ముగింపు, మరొకరికి ఆరంభం.