BREAKING
జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిరోజు స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో కార్యక్రమం పవన్ కళ్యాణ్ ఆరోగ్య మెరుగుకై చాట్రాయి మండల జనసైనికుల ప్రత్యేక పూజ రైల్వే అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి జనార్ధనవరం గ్రామంలో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు చనుబండలో నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు టాయిలెట్ లో ఎలా కూర్చోవాలో నేటి తరానికి నేర్పిస్తున్న కొణిదెల ఉపాసన గొల్లప్రోలు లో అంబరాన్నంటిన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు రేపట్నుంచే ఆర్టీసీ సమ్మె… నిలిచిపోనున్న బస్సులు పోతనపల్లిలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు 65 ​జాతీయ రహదారిపై డీజిల్ నో స్టాక్ జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిరోజు స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో కార్యక్రమం పవన్ కళ్యాణ్ ఆరోగ్య మెరుగుకై చాట్రాయి మండల జనసైనికుల ప్రత్యేక పూజ రైల్వే అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి జనార్ధనవరం గ్రామంలో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు చనుబండలో నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు టాయిలెట్ లో ఎలా కూర్చోవాలో నేటి తరానికి నేర్పిస్తున్న కొణిదెల ఉపాసన గొల్లప్రోలు లో అంబరాన్నంటిన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు రేపట్నుంచే ఆర్టీసీ సమ్మె… నిలిచిపోనున్న బస్సులు పోతనపల్లిలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు 65 ​జాతీయ రహదారిపై డీజిల్ నో స్టాక్
www.ntodaynews.com

ఒకరి మరణం… పలువురికి జీవం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Mar, 2026 - 03:05 PM
150 వీక్షణలు

అవయవ దానం గొప్పతనానికి నిలువెత్తు ఉదాహరణ 

అవయవ దానం… మరణానికైనా మానవత్వం!

జంగారెడ్డిగూడెం:

ప్రతి ఒక్కరూ అవయవ దానం పట్ల అవగాహన కలిగి ఉండాలని గుంటూరు కిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వినోద్ పేర్కొన్నారు. ఇటీవల పట్టణానికి చెందిన నాయుడు మధుశ్రీ బ్రెయిన్ డెడ్ అయిన నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు చేసిన అవయవ దానం ఎంతో ఆదర్శప్రాయమని ఆయన అభినందించారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు జీవన్ దాన్ సంయుక్తంగా నాయుడు మధుశ్రీ కుటుంబ సభ్యులకు శనివారం అవయవ దానం డోనర్ సర్టిఫికెట్‌ను అందజేశారు.

డాక్టర్ వినోద్ మాట్లాడుతూ—కుమార్తె మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులు చూపిన మహోన్నత నిర్ణయం అనేకమందికి కొత్త జీవితం ప్రసాదించిందన్నారు. మధుశ్రీ ఊపిరితిత్తులు, లివర్, మూత్రపిండాలు, కళ్ళు దానం చేయడం ద్వారా పలువురి జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డోనర్ సర్టిఫికెట్‌ను తండ్రి సత్యనారాయణకు, సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ మరియు మేనమామ వీరమల్ల మధుకి అందజేశారు.

అవయవ దానం – ఒకరి ముగింపు, మరొకరికి ఆరంభం.