BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

ఒకరి మరణం… పలువురికి జీవం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Mar, 2026 - 03:05 PM
211 వీక్షణలు

అవయవ దానం గొప్పతనానికి నిలువెత్తు ఉదాహరణ 

అవయవ దానం… మరణానికైనా మానవత్వం!

జంగారెడ్డిగూడెం:

ప్రతి ఒక్కరూ అవయవ దానం పట్ల అవగాహన కలిగి ఉండాలని గుంటూరు కిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వినోద్ పేర్కొన్నారు. ఇటీవల పట్టణానికి చెందిన నాయుడు మధుశ్రీ బ్రెయిన్ డెడ్ అయిన నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు చేసిన అవయవ దానం ఎంతో ఆదర్శప్రాయమని ఆయన అభినందించారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు జీవన్ దాన్ సంయుక్తంగా నాయుడు మధుశ్రీ కుటుంబ సభ్యులకు శనివారం అవయవ దానం డోనర్ సర్టిఫికెట్‌ను అందజేశారు.

డాక్టర్ వినోద్ మాట్లాడుతూ—కుమార్తె మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులు చూపిన మహోన్నత నిర్ణయం అనేకమందికి కొత్త జీవితం ప్రసాదించిందన్నారు. మధుశ్రీ ఊపిరితిత్తులు, లివర్, మూత్రపిండాలు, కళ్ళు దానం చేయడం ద్వారా పలువురి జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డోనర్ సర్టిఫికెట్‌ను తండ్రి సత్యనారాయణకు, సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ మరియు మేనమామ వీరమల్ల మధుకి అందజేశారు.

అవయవ దానం – ఒకరి ముగింపు, మరొకరికి ఆరంభం.