ఓపీఎంఎస్ రశీదుల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి: జిల్లా అదనపు కలెక్టర్ వి.రాములు
అధికారులు సమన్వయంతో కృషి చేసి గడువులోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి
ధాన్యం కొనుగోలులో ఆన్లైన్ ప్రొక్యూర్ మెంట్ మేనేజ్మెంట్ సిస్టం (ఓపీఎంఎస్) రశీదుల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు తెలిపారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని జిల్లా అదనపు కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళలతో కలిసి ఎస్.డబ్ల్యూ.సి. నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలులో ఓపీఎంఎస్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని కోరారు. ప్రభుత్వ నిర్దేశిత గడువులోగా జిల్లాలో ధాన్యం ప్రక్రియ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఆ దిశగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎసిఎస్ఓ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు