BREAKING
రాగి రాజు మృతికి గ్రామ ప్రముఖుల సంతాపం మరోసారి పెరిగిన అమూల్ పాల ధరలు తప్పు చేసినవారికి శిక్ష తప్పదు: మంత్రి సీతక్క కేంద్రం సంచలన నిర్ణయం.. త్వరలో కొత్త ‘గోల్డ్ మానిటైజేషన్’ పాలసీ..! రేపటి నుంచి శుభకార్యాలకు బ్రేక్‌.. 36 రోజుల పాటు ముహూర్తాలకు విరామం ఊపిరి పీల్చుకున్న విజయ్.. భారీ విజయం.. ఇక ఢోకా లేనట్టే..! సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి తృటిలో తప్పిన లిఫ్ట్ ప్రమాదం! CM వాహన శ్రేణికి కత్తెర.. 50 శాతం తగ్గింపునకు ఆదేశాలు నూతన వధూవరుల ఆశీర్వదించిన పున్నం ప్రభాకర్ గారు అనుచరుడు పురుషోత్తం మల్లేష్ గారి కూతురి వివాహ వేడుకలు భాగంగా రైతులకు అండగా ఉంటాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాగి రాజు మృతికి గ్రామ ప్రముఖుల సంతాపం మరోసారి పెరిగిన అమూల్ పాల ధరలు తప్పు చేసినవారికి శిక్ష తప్పదు: మంత్రి సీతక్క కేంద్రం సంచలన నిర్ణయం.. త్వరలో కొత్త ‘గోల్డ్ మానిటైజేషన్’ పాలసీ..! రేపటి నుంచి శుభకార్యాలకు బ్రేక్‌.. 36 రోజుల పాటు ముహూర్తాలకు విరామం ఊపిరి పీల్చుకున్న విజయ్.. భారీ విజయం.. ఇక ఢోకా లేనట్టే..! సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి తృటిలో తప్పిన లిఫ్ట్ ప్రమాదం! CM వాహన శ్రేణికి కత్తెర.. 50 శాతం తగ్గింపునకు ఆదేశాలు నూతన వధూవరుల ఆశీర్వదించిన పున్నం ప్రభాకర్ గారు అనుచరుడు పురుషోత్తం మల్లేష్ గారి కూతురి వివాహ వేడుకలు భాగంగా రైతులకు అండగా ఉంటాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
www.ntodaynews.com

ఊపిరి పీల్చుకున్న విజయ్.. భారీ విజయం.. ఇక ఢోకా లేనట్టే..!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 May, 2026 - 09:58 PM
11 వీక్షణలు

తమిళనాడు రాజకీయాల్లో సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన టీవీకే అధినేత విజయ్ మరో కీలక పరీక్షలో ఘన విజయం సాధించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు ఎన్నో రాజకీయ ఒత్తిళ్లు, వ్యూహాత్మక సవాళ్లు ఎదుర్కొన్న విజయ్.. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అడుగడుగునా పరీక్షలను ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే ప్రతి పరీక్షను విజయవంతంగా దాటుకుంటూ తన రాజకీయ పట్టును మరింత బలంగా చాటుకుంటున్నారు.

ముఖ్యమంత్రిగా ఇటీవల చేసిన తొలి ప్రసంగంతోనే అసెంబ్లీలో తన దూకుడు చూపించిన విజయ్.. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లోనూ తన వ్యూహాన్ని సక్సెస్ చేశారు. తన పార్టీకి చెందిన నేతలకే ఆ కీలక పదవులు దక్కేలా చేసి ప్రత్యర్థులకు షాక్ ఇచ్చారు.

ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన విశ్వాస పరీక్షలోనూ విజయ్ సత్తా చాటారు. బుధవారం తమిళనాడు అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో టీవీకే ప్రభుత్వానికి ఏకంగా 144 ఓట్లు లభించాయి. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు, వీసీకేతో పాటు అన్నాడీఎంకేకు చెందిన కొంతమంది రెబల్ ఎమ్మెల్యేలు కూడా విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు.

ఇక అన్నాడీఎంకేకు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటు వేయగా, డీఎంకే మాత్రం ఓటింగ్‌కు దూరంగా ఉండి వాక్‌అవుట్ చేసింది. దీంతో అసెంబ్లీలో విజయ్ బలం మరింత స్పష్టమైంది.

భారీ మెజారిటీతో విశ్వాస పరీక్షను గెలుచుకోవడంతో విజయ్ ప్రభుత్వం మరింత స్థిరపడిందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మొదటి నుంచీ అనుమానాలు వ్యక్తం చేసిన ప్రత్యర్థులకు ఈ ఫలితం గట్టి సమాధానంగా మారింది. ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో విజయ్ దూకుడు హాట్ టాపిక్‌గా మారింది.