BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్ వి. రాములు

తెలంగాణ
/ మంచిర్యాల / జైపూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
09 Jun, 2026 - 05:32 PM
126 వీక్షణలు

​క్షేత్రస్థాయిలో దరఖాస్తుల వేగవంతమైన పరిష్కారానికి అధికారులకు పిలుపు

జూన్ 25వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న మూడవ విడత ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని జిల్లాలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ వి. రాములు అన్నారు. మంగళవారం ఆయన హాజీపూర్, భీమారం, జైపూర్ మండల తహసిల్దార్ కార్యాలయాలను జిల్లా కలెక్టరేట్ విభాగ సూపరింటెండెంట్ మధుసూదన్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బందితో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం, సాదా బైనామా దరఖాస్తులు, మరియు భూభారతి పెండింగ్ దరఖాస్తుల పరిష్కరణ సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా బూత్ స్థాయి అధికారులు తప్పనిసరిగా ప్రతి ఇంటికీ వెళ్లేలా చర్యలు తీసుకోవాలని, సూపర్వైజర్లు మరియు సహాయ నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారులు ఈ పనుల పురోగతిని పరిశీలించాలని ఆయన తెలిపారు.

​ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి పోర్టల్ ను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజల యొక్క ప్రతి సమస్యను పరిష్కరించడం జరుగుతుందని, ఈ క్రమంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కరణ వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో సాదా బైనామా దరఖాస్తులను క్షుణ్ణంగా విచారణ చేసి పరిశీలించిన తర్వాతే ఆమోదించాలని తెలిపారు. కార్యాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని, కార్యాలయానికి వచ్చే ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. ధృవీకరణ పత్రాలను నిబంధనలకు లోబడి, నిర్ణీత గడువులోగా జారీ చేయాలని తెలిపారు. ఈ సమీక్షా కార్యక్రమంలో సంబంధిత అధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు