BREAKING
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం!
www.ntodaynews.com

ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్ వి. రాములు

తెలంగాణ
/ మంచిర్యాల / జైపూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
09 Jun, 2026 - 05:32 PM
9 వీక్షణలు

​క్షేత్రస్థాయిలో దరఖాస్తుల వేగవంతమైన పరిష్కారానికి అధికారులకు పిలుపు

జూన్ 25వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న మూడవ విడత ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని జిల్లాలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ వి. రాములు అన్నారు. మంగళవారం ఆయన హాజీపూర్, భీమారం, జైపూర్ మండల తహసిల్దార్ కార్యాలయాలను జిల్లా కలెక్టరేట్ విభాగ సూపరింటెండెంట్ మధుసూదన్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బందితో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం, సాదా బైనామా దరఖాస్తులు, మరియు భూభారతి పెండింగ్ దరఖాస్తుల పరిష్కరణ సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా బూత్ స్థాయి అధికారులు తప్పనిసరిగా ప్రతి ఇంటికీ వెళ్లేలా చర్యలు తీసుకోవాలని, సూపర్వైజర్లు మరియు సహాయ నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారులు ఈ పనుల పురోగతిని పరిశీలించాలని ఆయన తెలిపారు.

​ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి పోర్టల్ ను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజల యొక్క ప్రతి సమస్యను పరిష్కరించడం జరుగుతుందని, ఈ క్రమంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కరణ వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో సాదా బైనామా దరఖాస్తులను క్షుణ్ణంగా విచారణ చేసి పరిశీలించిన తర్వాతే ఆమోదించాలని తెలిపారు. కార్యాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని, కార్యాలయానికి వచ్చే ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. ధృవీకరణ పత్రాలను నిబంధనలకు లోబడి, నిర్ణీత గడువులోగా జారీ చేయాలని తెలిపారు. ఈ సమీక్షా కార్యక్రమంలో సంబంధిత అధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు