www.ntodaynews.com
ఓటరు జాబితా పరిశీలనలో పాల్గొన్న వాసం మునియ్య
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని ఏ.కొండూరు మండలం పొలిశెట్టిపాడు గ్రామంలో చేపట్టిన SIR (Special Intensive Revision) కార్యక్రమంలో భాగంగా 194వ బూత్ పరిధిలో ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మాదిగ వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వాసం మునియ్య BLOతో కలిసి పాల్గొని ఓటర్ల వివరాలను పరిశీలించారు. ప్రతి అర్హత కలిగిన పౌరుడు తన పేరు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో కొమ్ము సురేష్, స్థానిక నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వాసం మునియ్య మాట్లాడుతూ, "ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఓటు విలువైనది. ఓటరు జాబితాను పరిశీలించి, అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత" అని పేర్కొన్నారు.