BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

పాడి పరిశ్రమ ప్రారంభించిన స్థానిక శాసన సభ్యురాలు

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
10 Apr, 2026 - 09:49 PM
76 వీక్షణలు

పాడి పరిశ్రమ విజయ డెయిరీ పాల ఉత్పత్తిదారుల సహకార భవనాన్ని ప్రారంభించిన స్థానిక శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి..

దేవరుప్పుల మండల కేంద్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి కీలకమైన అడుగుగా విజయ డెయిరీ పాల ఉత్పత్తిదారుల సహకార భవనాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి , తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమైక్య లిమిటెడ్ (TSDDCF) చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో పాడి పరిశ్రమ రైతులకు అదనపు ఆదాయ వనరుగా మారుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం పాడి రైతులకు ప్రోత్సాహకాలు, సబ్సిడీలు అందిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. కొత్తగా ప్రారంభమైన ఈ సహకార భవనం ద్వారా పాల సేకరణ, నిల్వ, పంపిణీ వంటి సేవలు ఒకే చోట అందుబాటులోకి వచ్చి రైతులకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.

తద్వారా రైతులు మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా డెయిరీ ద్వారా మంచి ధరలు పొందే అవకాశముంటుందని, మహిళా సంఘాలు కూడా పాడి పరిశ్రమలో భాగస్వామ్యం కావడం ద్వారా ఆర్థికంగా బలపడతాయని ఎమ్మెల్యే తెలిపారు..

చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి గారు మాట్లాడుతూ, తెలంగాణలో పాడి పరిశ్రమను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. విజయ డెయిరీ ద్వారా రైతులకు పారదర్శకంగా సేవలు అందిస్తూ, నాణ్యమైన పాల ఉత్పత్తులను వినియోగదారులకు అందిస్తున్నామని తెలిపారు. ఈ సహకార భవనం పాడి రైతుల అభివృద్ధికి కేంద్రంగా మారి, మరింత మంది రైతులను ఈ రంగంలోకి తీసుకురావడానికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు..

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, డెయిరీ సంఘ సభ్యులు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భవనం ప్రారంభంతో దేవరుప్పుల మండలంలో పాడి పరిశ్రమకు కొత్త ఊపు వచ్చి, రైతుల జీవనోపాధి మెరుగుపడుతుందని ఆశిస్తున్నారు..