www.ntodaynews.com
దుర్గమ్మ పండుగలో ఘర్షణ
తెలంగాణ
/
జనగామ
మద్యం మత్తులో కర్రలతో దాడి – ఒకరికి తీవ్ర గాయాలు
పెద్ద వంగర మండలం – అవతాపరం గ్రామం
పెద్ద వంగర మండలం అవతాపరం గ్రామంలో దుర్గమ్మ పండుగ సందర్భంగా జరిగిన వేడుకల్లో ఘర్షణ చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న కొందరి మధ్య వివాదం చెలరేగి, అది కర్రలతో దాడికి దారితీసింది.
ఈ ఘటనలో ఒక వ్యక్తి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది.