BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

పామాయిల్ రైతుల ఆత్మీయ నాయకుడు కావూరి సాంబశివరావుకు ఘన నివాళి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Mar, 2026 - 06:31 AM
111 వీక్షణలు

పామాయిల్ రైతుల ఆత్మీయ నాయకుడు కావూరి సాంబశివరావుకు ఘన నివాళి

ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం ఎర్రగుంటపల్లి గ్రామంలో శుక్రవారం గోద్రెజ్ ఫ్యాక్టరీ పరిధిలోని ఆయిల్ పామ్ రైతులు ఇటీవల మరణించిన కావూరి సాంబశివరావుకు సంతాప సభ నిర్వహించారు. పామాయిల్ పంట అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా రైతులు స్మరించుకున్నారు.

పామాయిల్ రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పెనుమత్స రామరాజు మాట్లాడుతూ, పామాయిల్ పంటను అభివృద్ధి చేయడంలో కావూరి సాంబశివరావు ఎనలేని కృషి చేశారని కొనియాడారు. రైతులకు గిట్టుబాటు ధర సాధనలో ఆయన పోషించిన పాత్ర అపూర్వమని పేర్కొన్నారు. పామాయిల్ పంటకు ఈ స్థాయి మార్కెట్ ఏర్పడటానికి ఆయన కృషి ప్రధాన కారణమని అన్నారు.

ఈ సందర్భంగా పలువురు రైతులు ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. రైతుల హక్కుల సాధన కోసం జీవితాంతం పోరాడిన నాయకుడిగా కావూరి సాంబశివరావును స్మరించారు.

ఈ సమావేశం పామాయిల్ అసోసియేషన్ అధ్యక్షులు పెనుమత్స రామరాజు అధ్యక్షతన జరిగింది.