పామాయిల్ రైతుల ఆత్మీయ నాయకుడు కావూరి సాంబశివరావుకు ఘన నివాళి
పామాయిల్ రైతుల ఆత్మీయ నాయకుడు కావూరి సాంబశివరావుకు ఘన నివాళి
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం ఎర్రగుంటపల్లి గ్రామంలో శుక్రవారం గోద్రెజ్ ఫ్యాక్టరీ పరిధిలోని ఆయిల్ పామ్ రైతులు ఇటీవల మరణించిన కావూరి సాంబశివరావుకు సంతాప సభ నిర్వహించారు. పామాయిల్ పంట అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా రైతులు స్మరించుకున్నారు.
పామాయిల్ రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పెనుమత్స రామరాజు మాట్లాడుతూ, పామాయిల్ పంటను అభివృద్ధి చేయడంలో కావూరి సాంబశివరావు ఎనలేని కృషి చేశారని కొనియాడారు. రైతులకు గిట్టుబాటు ధర సాధనలో ఆయన పోషించిన పాత్ర అపూర్వమని పేర్కొన్నారు. పామాయిల్ పంటకు ఈ స్థాయి మార్కెట్ ఏర్పడటానికి ఆయన కృషి ప్రధాన కారణమని అన్నారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. రైతుల హక్కుల సాధన కోసం జీవితాంతం పోరాడిన నాయకుడిగా కావూరి సాంబశివరావును స్మరించారు.
ఈ సమావేశం పామాయిల్ అసోసియేషన్ అధ్యక్షులు పెనుమత్స రామరాజు అధ్యక్షతన జరిగింది.