BREAKING
మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
www.ntodaynews.com

పాముకాటుకు భవన నిర్మాణ కార్మికుడు మృతి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
04 Aug, 2026 - 08:33 PM
304 వీక్షణలు

పాముకాటుకు భవన నిర్మాణ కార్మికుడు మృతి

భవన నిర్మాణ పనుల్లో భాగంగా పాముకాటుకు గురై చికిత్స పొందుతూ ఓ కార్మికుడు మృతి చెందిన ఘటన రామన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  మునిపంపుల గ్రామానికి చెందిన ఉండ్రాతి వెంకన్న (33) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గత జులై 31వ తేదీన కొత్తగూడెం గ్రామంలో ఓ ఇంటి నిర్మాణ పనుల వద్ద పని చేస్తుండగా ఆయనను విషపూరిత పాము కాటు వేసింది అని తెలిపారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన వెంకన్నను వెంటనే రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

​అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. పరిస్థితి మరింత విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయనను నల్గొండలోని పెరుమాండ్ల ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఆగస్టు 03 మధ్యాహ్నం సుమారు 3:00 గంటల ప్రాంతంలో వెంకన్న మరణించాడని తెలియజేశారు  మృతుని భార్య ఉండ్రాతి నవనీత  ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామన్నపేట ఎస్సై సతీష్  కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.