BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

పార్వతీపురం మన్యం జిల్లాలో గజరాజుల సంచారం.. రైతుల్లో ఆందోళన

ఆంధ్రప్రదేశ్
/ పార్వతీపురం మన్యం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:33 PM
31 వీక్షణలు

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల సంచారం స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. గత కొన్ని రోజులుగా సాలూరు, పార్వతీపురం నియోజకవర్గాల పరిధిలో సంచరిస్తున్న గజరాజులు, సోమవారం రాత్రి సీతానగరం మండలం గుచ్చిమి గ్రామంలో ప్రత్యక్షమయ్యాయి.

గ్రామ పరిసరాల్లోకి వచ్చిన ఏనుగులు రెండు వరి కోత యంత్రాలను ధ్వంసం చేశాయి. ఇటీవల పామాయిల్ తోటలు, వ్యవసాయ మోటార్లను కూడా నాశనం చేసినట్లు రైతులు చెబుతున్నారు.

అటవీ ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాల్లోనూ ఏనుగులు సంచరిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంటలు, వ్యవసాయ పరికరాలకు నష్టం వాటిల్లడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, ప్రజలు మరియు రైతుల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు అటవీ శాఖ తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.