BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

పచ్చిరొట్ట పైర్లతో భూసారం పెంపు.. రైతులకు చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ కీలక సూచనలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jun, 2026 - 07:17 PM
108 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయిలో పచ్చిరొట్ట పైర్ల సాగు ద్వారా భూసారాన్ని పెంపొందించుకోవాలని రైతులకు చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ సూచించారు. తొలకరిలో వరి మరియు ఇతర పంటలు సాగు చేసే రైతులు పెసలు, అలసంద, జనుము, జీలుగా, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట పైర్లను పూత దశకు ముందే కలియదున్నడం వల్ల భూమిలో సేంద్రీయ కర్బనం పెరిగి, నేల సారం గణనీయంగా మెరుగుపడుతుందని తెలిపారు.

అలాగే అజోస్పైరిల్లం, పాస్పో బ్యాక్టీరియా వంటి జీవన ఎరువులను ఎకరానికి 2 నుంచి 3 కిలోల చొప్పున వినియోగించడం ద్వారా రసాయనిక ఎరువుల అవసరాన్ని తగ్గించుకోవచ్చని చెప్పారు. పశువుల ఎరువు, కంపోస్టు, పంట అవశేషాలను ఎకరానికి నాలుగు టన్నుల మేర వాడటం వల్ల భూమి భౌతిక, రసాయనిక, జీవ లక్షణాలు మెరుగుపడి అధిక దిగుబడులకు దోహదపడుతాయని వివరించారు.

ముఖ్యంగా పొటాష్ లోపం ఉన్న పొలాల్లో పొటాష్ అధికంగా ఉండే వరిగడ్డిని తొక్కించడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. సేంద్రియ ఎరువుల వినియోగం ద్వారా హెక్టారుకు 20 నుంచి 40 కిలోల నత్రజని, 10 నుంచి 15 కిలోల భాస్వరం, 30 నుంచి 40 కిలోల పొటాష్ లభిస్తాయని వెల్లడించారు.

ఈ సందర్భంగా చాట్రాయిలో పచ్చిరొట్ట పైర్లు సాగు చేసిన వరి పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన వ్యవసాయ అధికారి బి. శివశంకర్, రైతులకు భూసార పరిరక్షణ, సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు. భూమి ఆరోగ్యమే రైతు సంపదకు పునాది అని, పచ్చిరొట్ట పైర్ల సాగు భవిష్యత్‌లో అధిక దిగుబడులకు బాటలు వేస్తుందని పేర్కొన్నారు.