BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

పెద్ద కాపర్తి శివారులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు,

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / పెద్దకాపర్తి
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
30 May, 2026 - 07:24 AM
344 వీక్షణలు

65వ నెంబర్ జాతీయ రహదారిపై తృటిలో తప్పిన ప్రాణనష్టం 

నల్లగొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో శనివారం తెల్లవారుజామున ఒక భారీ బస్సు ప్రమాదం  చోటుచేసుకుంది. హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి, బస్సు పూర్తిగా దహనమైంది. ప్రయాణికులందరూ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో తృటిలో పెద్ద ప్రాణనష్టం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. రెయిన్‌బో ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ లగ్జరీ బస్సు  శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రయాణికులతో కాకినాడకు బయలుదేరింది. శనివారం తెల్లవారుజామున సుమారు 2:00 గంటల ప్రాంతంలో ఈ బస్సు నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులోకి చేరుకుంది. ఆ సమయంలో బస్సు ఇంజన్ నుండి ఒక్కసారిగా దట్టమైన పొగలు, మంటలు చెలరేగాయి.

​డ్రైవర్, క్లీనర్ సమయస్ఫూర్తి

​ఇంజన్‌లో మంటలను గమనించిన బస్సు డ్రైవర్, క్లీనర్ వెంటనే అప్రమత్తమయ్యారు. వారు క్షణాల వ్యవధిలో బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి,  బస్సులో ప్రయాణికులను  త్వరితగతిన కిందకు దించేశారు. ప్రయాణికులు కిందకు దిగిన కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తం వేగంగా వ్యాపించాయి. చూస్తుండగానే బస్సు పూర్తిగా అగ్నికీలల్లో చిక్కుకుపోయింది.​ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం ప్రాథమిక సమాచారం.  మంటలు క్షణాల్లో వ్యాపించడంతో బస్సు డిక్కీలో మరియు లోపల ఉన్న ప్రయాణికుల లగేజీ, విలువైన సామాన్లు, బ్యాగులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.