BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

పెద్దమ్మ తల్లి పట్నాలలో పాల్గొన్న మంత్రి అడ్లూరి..

తెలంగాణ
/ పెద్దపల్లి
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
22 Mar, 2026 - 03:47 PM
61 వీక్షణలు

పెద్దమ్మ తల్లి పట్నాలలో పాల్గొన్న మంత్రి అడ్లూరి.. ఆలయ మండప నిర్మాణానికి రూ. 15 లక్షలు మంజూరు!

ధర్మారం మండలం కొత్తూరు గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహించిన పెద్దమ్మ తల్లి పట్నాల కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి గ్రామస్తులు, భక్తులు డప్పు చప్పులతో, మంగళ వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు.

​అమ్మవారికి ప్రత్యేక పూజలు:

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులతో కలిసి పట్నాల వేడుకలో పాలుపంచుకున్నారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు.

​రూ. 15 లక్షల నిధుల ప్రకటన:

ఆలయ అభివృద్ధిపై గ్రామస్తులు విన్నవించగా, సానుకూలంగా స్పందించిన మంత్రి.. పెద్దమ్మ తల్లి ఆలయ మండప నిర్మాణానికి రూ. 15 లక్షలు మంజూరు చేస్తున్నట్లు అక్కడికక్కడే ప్రకటించారు. నిధుల కేటాయింపు పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

​ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.