www.ntodaynews.com
పీలేరులో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ముగ్గురు దుర్మరణం
ఆంధ్రప్రదేశ్
అన్నమయ్య జిల్లా పీలేరు మండలం టానా వడ్డిపల్లి సమీపంలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పీర్ల పండుగకు వెళ్లి తిరిగి వస్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులు రేగళ్ల గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ముబారక్, మెహరున్ బీ, ఆమె మనవడు వాహిద్గా గుర్తించారు.
ఈ ప్రమాదంలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడగా, 108 అంబులెన్స్లో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషాద ఘటనతో రేగళ్ల గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.