BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jun, 2026 - 03:26 PM
63 వీక్షణలు

పెనమలూరు, 08/06/2026:

పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్ల ప్రవర్తనలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ఆదివారం కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సమావేశానికి స్టేషన్ ఇంచార్జ్ CI N. వెంకటనారాయణ ఆధ్వర్యం వహించారు.

స్ధానిక పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లందరినీ పిలిపించి వారి ప్రస్తుత జీవన విధానం, కార్యకలాపాలపై వివరంగా ఆరా తీసారు.

ఈ సందర్భంగా CI మాట్లాడుతూ, సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. పాత నేర ప్రవర్తన, అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా మానుకుని, సామాన్య పౌరుల్లా బాధ్యతాయుతంగా జీవించాలన్నారు. చట్ట వ్యతిరేక పనులకు దూరంగా ఉండి, కుటుంబాలతో ప్రశాంతమైన జీవితం గడపాలని సూచించారు.

ఇకపైనా ఎవరు గొడవలకు దిగితే, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే P.D. యాక్ట్ కూడా నమోదు చేయడానికి వెనుకాడబోమని CI స్పష్టం చేశారు.