www.ntodaynews.com
పెనుగొలనులో చేతివృత్తుల కళాకారులకు ఘన సన్మానం
ఆంధ్రప్రదేశ్
పెనుగొలనులో చేతివృత్తుల కళాకారులకు ఘన సన్మానం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో ఉగాది పర్వదినం సందర్భంగా గురువారం చేతివృత్తుల కళాకారులకు ఘన సన్మానం నిర్వహించారు. శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో 21 మంది కళాకారులకు జ్ఞాపికలు అందజేసి నూతన వస్త్రాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా విశ్రాంత ఎంఈఓ వి. శేషి రెడ్డి మాట్లాడుతూ, చేతివృత్తుల కళాకారులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటి వారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు, వెదురు వెంకటరెడ్డి, పరుచూరు హరి మాధవగుప్తా, దేవరపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.