BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

ఘనంగా పెనుగొలనులో దివిసీమ గాంధీ మండలి వెంకటకృష్ణారావు శత జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Aug, 2026 - 02:34 PM
64 వీక్షణలు

ఘనంగా పెనుగొలనులో దివిసీమ గాంధీ మండలి వెంకటకృష్ణారావు శత జయంతి వేడుకలు 

గంపలగూడెం, ఆగస్టు 4: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామ గ్రంథాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రజానాయకుడు దివిసీమ గాంధీ మండలి వెంకటకృష్ణారావు శత జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో గ్రంథాలయ అధికారి తెనాలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, మండలి వెంకటకృష్ణారావు స్వాతంత్ర్య సమరయోధుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, విద్య, సాంస్కృతిక, సాంఘిక సంక్షేమ, మత్స్య సహకార శాఖల మంత్రిగా విశిష్ట సేవలు అందించారని కొనియాడారు.

1975లో జరిగిన తొలి ప్రపంచ తెలుగు మహాసభలకు సారథ్యం వహించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి తెలుగు భాష, సంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడిగా ఆయన నిలిచారని పేర్కొన్నారు. అలాగే అంతర్జాతీయ తెలుగు సంస్థ అధ్యక్షుడిగా 1981లో మలేషియాలో నిర్వహించిన ద్వితీయ ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతంగా నిర్వహించి తెలుగు జాతికి విశిష్ట సేవలు అందించారని గుర్తుచేశారు.

కాన్వెంట్ ప్రిన్సిపాల్ తోట నాగరాజు మాట్లాడుతూ, 1977 దివిసీమ ఉప్పెన సమయంలో వేలాది మంది బాధితులకు అండగా నిలిచి ప్రజల హృదయాల్లో **"దివిసీమ గాంధీ"**గా చిరస్థాయిగా నిలిచారని అన్నారు. ప్రజలే రాజకీయాల కేంద్రబిందువని విశ్వసిస్తూ జీవితాంతం ప్రజాసేవకు అంకితమైన ఆయన జీవితం భావితరాలకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.

అనంతరం పాల్గొన్న వారికి మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో తోలేటి జయసింహ, వూటుకూరు యజ్ఞకృష్ణతో పాటు పలువురు గ్రామస్థులు, పాఠకులు పాల్గొన్నారు.