BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

పెనుగొలనులో ఘనంగా కవిసార్వభౌముడు శ్రీనాథ మహాకవి జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jun, 2026 - 01:15 PM
103 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో గురువారం కవిసార్వభౌముడు శ్రీనాథ మహాకవి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీనాథ మహాకవి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, 15వ శతాబ్దానికి చెందిన ప్రముఖ తెలుగు కవి శ్రీనాథుడు తెలుగు సాహిత్యాన్ని విశేషంగా సుసంపన్నం చేశారని పేర్కొన్నారు. శివరాత్రి మహత్యం, హరవిలాసం, పల్నాటి వీర చరిత్ర, శృంగార నైషధం, కాశీఖండము, భీమేశ్వర పురాణం వంటి అద్భుత కావ్యాలను రచించి తెలుగు భాషకు అపూర్వమైన సేవలు అందించారని కొనియాడారు.

తెలుగు సాహిత్య చరిత్రలో శ్రీనాథుడి కృషి విశిష్టమైందని, ఆయన ప్రభావం కారణంగానే 15వ శతాబ్దాన్ని “శ్రీనాథ యుగం”గా పిలుస్తారని తెలిపారు. తెలుగు భాషకు, సాహిత్యానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి తెనాలి వెంకటేశ్వర్లు, గండ్ర వెంకటేశ్వరరావు, బొర్ర శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. పెనుగొలనులో ఘనంగా కవిసార్వభౌముడు శ్రీనాథ మహాకవి జయంతి వేడుకలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో గురువారం కవిసార్వభౌముడు శ్రీనాథ మహాకవి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీనాథ మహాకవి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, 15వ శతాబ్దానికి చెందిన ప్రముఖ తెలుగు కవి శ్రీనాథుడు తెలుగు సాహిత్యాన్ని విశేషంగా సుసంపన్నం చేశారని పేర్కొన్నారు. శివరాత్రి మహత్యం, హరవిలాసం, పల్నాటి వీర చరిత్ర, శృంగార నైషధం, కాశీఖండము, భీమేశ్వర పురాణం వంటి అద్భుత కావ్యాలను రచించి తెలుగు భాషకు అపూర్వమైన సేవలు అందించారని కొనియాడారు.

తెలుగు సాహిత్య చరిత్రలో శ్రీనాథుడి కృషి విశిష్టమైందని, ఆయన ప్రభావం కారణంగానే 15వ శతాబ్దాన్ని “శ్రీనాథ యుగం”గా పిలుస్తారని తెలిపారు. తెలుగు భాషకు, సాహిత్యానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి తెనాలి వెంకటేశ్వర్లు, గండ్ర వెంకటేశ్వరరావు, బొర్ర శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.