పెనుగొలనులో ఘనంగా కవిసార్వభౌముడు శ్రీనాథ మహాకవి జయంతి వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో గురువారం కవిసార్వభౌముడు శ్రీనాథ మహాకవి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీనాథ మహాకవి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, 15వ శతాబ్దానికి చెందిన ప్రముఖ తెలుగు కవి శ్రీనాథుడు తెలుగు సాహిత్యాన్ని విశేషంగా సుసంపన్నం చేశారని పేర్కొన్నారు. శివరాత్రి మహత్యం, హరవిలాసం, పల్నాటి వీర చరిత్ర, శృంగార నైషధం, కాశీఖండము, భీమేశ్వర పురాణం వంటి అద్భుత కావ్యాలను రచించి తెలుగు భాషకు అపూర్వమైన సేవలు అందించారని కొనియాడారు.
తెలుగు సాహిత్య చరిత్రలో శ్రీనాథుడి కృషి విశిష్టమైందని, ఆయన ప్రభావం కారణంగానే 15వ శతాబ్దాన్ని “శ్రీనాథ యుగం”గా పిలుస్తారని తెలిపారు. తెలుగు భాషకు, సాహిత్యానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి తెనాలి వెంకటేశ్వర్లు, గండ్ర వెంకటేశ్వరరావు, బొర్ర శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. పెనుగొలనులో ఘనంగా కవిసార్వభౌముడు శ్రీనాథ మహాకవి జయంతి వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో గురువారం కవిసార్వభౌముడు శ్రీనాథ మహాకవి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీనాథ మహాకవి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, 15వ శతాబ్దానికి చెందిన ప్రముఖ తెలుగు కవి శ్రీనాథుడు తెలుగు సాహిత్యాన్ని విశేషంగా సుసంపన్నం చేశారని పేర్కొన్నారు. శివరాత్రి మహత్యం, హరవిలాసం, పల్నాటి వీర చరిత్ర, శృంగార నైషధం, కాశీఖండము, భీమేశ్వర పురాణం వంటి అద్భుత కావ్యాలను రచించి తెలుగు భాషకు అపూర్వమైన సేవలు అందించారని కొనియాడారు.
తెలుగు సాహిత్య చరిత్రలో శ్రీనాథుడి కృషి విశిష్టమైందని, ఆయన ప్రభావం కారణంగానే 15వ శతాబ్దాన్ని “శ్రీనాథ యుగం”గా పిలుస్తారని తెలిపారు. తెలుగు భాషకు, సాహిత్యానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి తెనాలి వెంకటేశ్వర్లు, గండ్ర వెంకటేశ్వరరావు, బొర్ర శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.