BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

పెనుగొలనులో ఘనంగా కవిసార్వభౌముడు శ్రీనాథ మహాకవి జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jun, 2026 - 01:15 PM
68 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో గురువారం కవిసార్వభౌముడు శ్రీనాథ మహాకవి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీనాథ మహాకవి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, 15వ శతాబ్దానికి చెందిన ప్రముఖ తెలుగు కవి శ్రీనాథుడు తెలుగు సాహిత్యాన్ని విశేషంగా సుసంపన్నం చేశారని పేర్కొన్నారు. శివరాత్రి మహత్యం, హరవిలాసం, పల్నాటి వీర చరిత్ర, శృంగార నైషధం, కాశీఖండము, భీమేశ్వర పురాణం వంటి అద్భుత కావ్యాలను రచించి తెలుగు భాషకు అపూర్వమైన సేవలు అందించారని కొనియాడారు.

తెలుగు సాహిత్య చరిత్రలో శ్రీనాథుడి కృషి విశిష్టమైందని, ఆయన ప్రభావం కారణంగానే 15వ శతాబ్దాన్ని “శ్రీనాథ యుగం”గా పిలుస్తారని తెలిపారు. తెలుగు భాషకు, సాహిత్యానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి తెనాలి వెంకటేశ్వర్లు, గండ్ర వెంకటేశ్వరరావు, బొర్ర శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. పెనుగొలనులో ఘనంగా కవిసార్వభౌముడు శ్రీనాథ మహాకవి జయంతి వేడుకలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో గురువారం కవిసార్వభౌముడు శ్రీనాథ మహాకవి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీనాథ మహాకవి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, 15వ శతాబ్దానికి చెందిన ప్రముఖ తెలుగు కవి శ్రీనాథుడు తెలుగు సాహిత్యాన్ని విశేషంగా సుసంపన్నం చేశారని పేర్కొన్నారు. శివరాత్రి మహత్యం, హరవిలాసం, పల్నాటి వీర చరిత్ర, శృంగార నైషధం, కాశీఖండము, భీమేశ్వర పురాణం వంటి అద్భుత కావ్యాలను రచించి తెలుగు భాషకు అపూర్వమైన సేవలు అందించారని కొనియాడారు.

తెలుగు సాహిత్య చరిత్రలో శ్రీనాథుడి కృషి విశిష్టమైందని, ఆయన ప్రభావం కారణంగానే 15వ శతాబ్దాన్ని “శ్రీనాథ యుగం”గా పిలుస్తారని తెలిపారు. తెలుగు భాషకు, సాహిత్యానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి తెనాలి వెంకటేశ్వర్లు, గండ్ర వెంకటేశ్వరరావు, బొర్ర శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.