పెనుగొలనులో జలియన్ వాలాబాగ్ సంస్కరణ దినోత్సవం
పెనుగొలనులో జలియన్ వాలాబాగ్ సంస్కరణ దినోత్సవం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను లో సోమవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో జలియన్ వాలాబాగ్ సంస్కరణ దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రెండు నిమిషాలు మౌనం పాటించి, దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించబడినాయి.
స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా 1919 ఏప్రిల్ 13న అమృత్ సర్ లోని జలియన్ వాలాబాగ్ లో శాంతియుతంగా సమావేశమైన నిరాయుధ భారతీయులపై బ్రిటిష్ సైనికులు, జనరల్ డయ్యర్ ఆధ్వర్యంలో అమానుషమైన కాల్పులు జరిపి వెయ్యి మందికి పైగా అమరవీరులను హత్య చేశారు. ఈ సంఘటన ప్రజల మనస్సుల్లో తీవ్ర మనోగతాన్ని కలిగించిందని వక్తలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రిన్సిపాల్ వెదురు వెంకటరెడ్డి, గ్రంథాలయ నిర్వాహకులు తెనాలి వెంకటేశ్వర్లు, శిరిడి సాయిబాబా కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు, కాన్వెంట్ ప్రిన్సిపాల్ వీరయ్య, విద్యార్థులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.