BREAKING
మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన
www.ntodaynews.com

పెనుగొలనులో రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపతి సాహు మహారాజ్ జయంతి ఘనంగా నిర్వహణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 11:02 AM
43 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో శుక్రవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో సంఘసంస్కర్త, రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపతి సాహు మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా సాహు మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ, కొల్లాపూర్ సంస్థాన మహారాజుగా (1900–1922) సాహు మహారాజ్ ప్రజాహిత పాలన అందించారని తెలిపారు.

1902 జూలై 26న ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసి సామాజిక న్యాయానికి బాటలు వేసిన మహోన్నత సంస్కర్తగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. ఉచిత, నిర్బంధ విద్య, అంటరానితనం నిర్మూలన, వ్యవసాయ సంస్కరణలు, మహిళా సాధికారత, పటేల్–పట్వారీ వ్యవస్థ రద్దు వంటి అనేక సంస్కరణలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు.

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సామాజిక న్యాయం కోసం ప్రారంభించిన "మూక్ నాయక్" పత్రికకు ఆర్థిక సహాయం అందించడమే కాకుండా, 1920లో అంబేడ్కర్ ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇంగ్లాండ్ వెళ్లేందుకు కూడా చేయూతనిచ్చిన గొప్ప మానవతావాది ఛత్రపతి సాహు మహారాజ్ అని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, విద్యార్థులు, సేవా కమిటీ సభ్యులు పాల్గొని సాహు మహారాజ్ సేవలను స్మరించుకున్నారు.