BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

పెనుగొలనులో రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపతి సాహు మహారాజ్ జయంతి ఘనంగా నిర్వహణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 11:02 AM
109 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో శుక్రవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో సంఘసంస్కర్త, రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపతి సాహు మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా సాహు మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ, కొల్లాపూర్ సంస్థాన మహారాజుగా (1900–1922) సాహు మహారాజ్ ప్రజాహిత పాలన అందించారని తెలిపారు.

1902 జూలై 26న ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసి సామాజిక న్యాయానికి బాటలు వేసిన మహోన్నత సంస్కర్తగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. ఉచిత, నిర్బంధ విద్య, అంటరానితనం నిర్మూలన, వ్యవసాయ సంస్కరణలు, మహిళా సాధికారత, పటేల్–పట్వారీ వ్యవస్థ రద్దు వంటి అనేక సంస్కరణలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు.

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సామాజిక న్యాయం కోసం ప్రారంభించిన "మూక్ నాయక్" పత్రికకు ఆర్థిక సహాయం అందించడమే కాకుండా, 1920లో అంబేడ్కర్ ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇంగ్లాండ్ వెళ్లేందుకు కూడా చేయూతనిచ్చిన గొప్ప మానవతావాది ఛత్రపతి సాహు మహారాజ్ అని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, విద్యార్థులు, సేవా కమిటీ సభ్యులు పాల్గొని సాహు మహారాజ్ సేవలను స్మరించుకున్నారు.