www.ntodaynews.com
పెరిగిన బంగారం ధరలు.. పసిడి ప్రియులకు మరో షాక్
జాతీయం
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం ధరలు మరోసారి పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.930 పెరిగి రూ.1,45,860కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.850 పెరిగి రూ.1,33,700గా నమోదైంది.
వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.2,40,000 వద్దనే ఉంది. అయితే స్థానిక మార్కెట్ పరిస్థితులను బట్టి తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.